విశాఖపట్నం ఎంజీఎం పార్కు సమీపంలోని సముద్ర తీరంలో సోమవారం ఒక యువతి మృతదేహం కొట్టుకురావడంతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని పెదగంట్యాడ హెచ్బీ కాలనీకి చెందిన వంగిపురం వైష్ణవిగా గుర్తించారు. ఎస్ఐ సురేష్ ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.