విశాఖలో నివసిస్తున్న ఒక వివాహిత, తన భర్తతో కలిసి ఈ నెల 26న విశాఖ ఎక్స్ప్రెస్లో నడికుడికి ప్రయాణిస్తుండగా, గుడివాడ - విజయవాడ మధ్యలో జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఆమెను కూపేలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు రెంటచింతల SI నాగార్జున కేసు నమోదు చేసి, కేసును విజయవాడకు బదిలీ చేశారు.