ఉండవల్లి: లోకేష్ ను కలిసిన రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్. మంత్రి నారా లోకేష్ ను బుధవారం ఉండవల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్, మాధవ్ ను మంగళగిరి శాలువాతో సత్కరించారు. ప్రతిపక్షంలో ఉండగా శాసనమండలిలో ప్రజాసమస్యలపై కలిసి పోరాడిన సందర్భాన్ని ఇద్దరు నేతలు నెమరు వేసుకున్నారు. మృదు స్వభావిగా పేరున్న మాధవ్ కు రాష్ట్ర సమస్యలపై సంపూర్ణమైన అవగాహన ఉంది.

సంబంధిత పోస్ట్