తల్లి డబ్బులు ఇవ్వలేదని కోపంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంతోష్ (20) అనే యువకుడిని విశాఖలోని కంచరపాలెం పోలీసులు కాపాడారు. శుక్రవారం మధ్యాహ్నం తల్లిని డబ్బులు అడగగా, ఆమె మందలించడంతో సంతోష్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తల్లి 112కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి తలుపులు విరగ్గొట్టి సంతోష్ ను కాపాడి, స్టేషన్ కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.