నౌపడ స్టేషన్లో ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రైల్వే శాఖ ట్రాఫిక్ బ్లాక్ ప్రకటించింది. ఏప్రిల్ 9న ఈ పనులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ-గుణుపూర్ ప్యాసింజర్ (58506/05), విశాఖ-పలాస మెము (67289/90) రైళ్లను అధికారులు రద్దు చేశారు. భద్రత దృష్ట్యా చేపట్టిన ఈ పనుల వల్ల కలిగే అంతరాయానికి ప్రయాణికులు సహకరించాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. పవన్ కుమార్ కోరారు.