విశాఖ సాగరతీరం టియు 142 ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన 'మాయా వరల్డ్' ను విఎంఆర్డిఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారిగా విశాఖలో ఏర్పాటు చేసిన ఈ మాయా వరల్డ్, నగర వాసులతో పాటు పర్యాటకులను ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'ఇమాజిన్ రూమ్స్' తరహాలో రూపొందించిన ఈ మ్యూజియం, లైటింగ్, అద్దాల ప్రతిబింబాలతో అద్భుత అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు.