విశాఖ: ఆర్.పి పట్నాయక్ లైవ్ కాన్సర్ట్ నేడు

విశాఖ ఉత్సవ్-2026 వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆర్కే బీచ్ వేదికగా ప్రముఖ గాయకుడు ఆర్.పి పట్నాయక్ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. సంగీత ప్రేమికులను అలరించేందుకు అతను తన బృందంతో ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ఈ కచేరీకి హాజరుకావాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పాసులు బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్