ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఒకే వేదికపై కలుసుకుని ఉత్సవాల పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలకు ప్రస్తుత మరియు పూర్వ విద్యార్థులు భారీగా తరలివచ్చారు. వంద ఏళ్ల విశ్వవిద్యాలయ చరిత్ర, ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.