దిత్వా తుఫాను ప్రభావంతో విశాఖపట్నం ఆర్కే బీచ్లో సోమవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తుఫాన్ కారణంగా బీచ్లో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. తీరం వెంబడి ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంది. వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయి, అక్కడక్కడా చిరు జల్లులు కూడా కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.