జగన్ ను కలిసిన గాజువాక మాజీ ఎమ్మెల్యే

గాజువాక మాజీ ఎమ్మెల్యే, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చింతలపూడి వెంకటరామయ్య, ఎలమంచిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి కరణం ధర్మశ్రీ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వై. ఎస్. జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వెంకటరామయ్య జగన్‌కు పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పార్టీ పరిస్థితిని జగన్ వారిద్దరినీ అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్