పశుగ్రాస వారోత్సవాల్లో భాగంగా సోమవారం మాడుగుల ఏరియా పశు వైద్య శాల సహాయ సంచాలకులు డా. వి. చిట్టి నాయుడు అద్వర్యంలో మాడుగుల మరిడిమాంబ కాలనీలో పాడి రైతులకు పశుగ్రాసాల సాగు, వాటి రకాలు ఉపయోగాలు గురించి వివరించారు. పాడిపశువు లకు పచ్చిమేత మేపడంవలన పశువులు ఆరోగ్యంగాఉండి పునరుత్పత్తి బాగా జరుగుతుందని, వెన్న శాతం బాగ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం మాడుగుల పశు వైద్య శాలలో కాకిజొన్న పశుగ్రాస విత్తనాలు ఉన్నాయన్నారు.