ఈ నెల 10న ఎం.కోడూరు హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు. 6వ తరగతి విద్యార్థినీ జి.లాస్య శ్రీ పాడిన పాట ప్రేక్షకులను అలరించింది. టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు పోతిన అర్జునరావు ఆమెను అభినందించి శుక్రవారం బహుమతి అందజేశారు. లాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసినందుకు ఉపాధ్యాయ బృందానికిప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.