పాడేరు ఐటిడిఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గ్రామస్థుల నుంచి వినతులు వెల్లువెత్తాయి. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డిఆర్ఓ కె. పద్మలతలు పాల్గొని వివిధ మండలాల నుంచి వచ్చిన తాగునీటి కొరత, రహదారుల దుస్థితి, సిసి రోడ్లు, డ్రైనేజీ లాంటి సమస్యలపై వినతులు స్వీకరించారు. అధికారులు వాటిని గమనించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.