అల్లూరి సీతారామరాజు జిల్లా, గంగవరం మండలం సమీపంలోని కుసుమరాయి జంక్షన్ వద్ద కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్టర్ ఇంజిన్ ముందు భాగం రెండు ముక్కలైంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.