అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లారీ అదుపు తప్పి వేగంగా కాగిత టోల్ ప్లాజాను ఢీకొని బీభత్సం సృష్టించింది. విశాఖ నుంచి కాకినాడ వైపుగా వెళ్లే లారీ ఒక్కసారిగా మొదటి కౌంటర్ నుంచి రెండో కౌంటర్పైకి దూసుకెళ్లింది. టోల్ వసూలు జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.