రాజవొమ్మంగి మండలం శరభవరం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై పశువులను నిర్లక్ష్యంగా వదిలివేసిన ఏడుగురిపై బైండొవర్ కేసులు నమోదు చేసి మండల మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచినట్లు రాజవొమ్మంగి ఎస్.ఐ. వెంకట్రావు తెలిపారు. జాతీయ రహదారిపై వరుసగా జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలో చోటుచేసుకుంది.