కార్తికమాసం రెండో సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సముద్ర తీర ప్రాంతాల్లోనూ, శైవాలయాల్లోనూ భక్తులు కిటకిటలాడారు. మహిళలు ప్రత్యేక పూజలు చేసి, దీపారాధన చేశారు. విశాఖ జిల్లాలోని పలు శివాలయాల్లో భక్తులు దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. శివనామస్మరణతో క్షేత్రాలు మారుమోగాయి.