విశాఖ: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి మిస్సింగ్..

ఉడా కాలనీకి చెందిన మందగాని గరటయ్య (మార్చి 21) ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం తెలిసినవారు వెతికినా దొరకలేదు. దీంతో శనివారం అతని భార్య ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. వ్యక్తి ఆచూకీ తెలిసినవారు దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్