విశాఖ: లబ్ధిదారులకు పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ప్రజలు క్షేమంగా, సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 41వ వార్డు పరిధిలో జ్ఞానాపురం ప్రాంతంలో స్పౌజ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శుక్రవారం పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ సొమ్మును అందించారు. అలాగే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్