విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరు ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ, లక్షలు వస్తాయని ఆశ చూపి యువతను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజువీధికి చెందిన చింతాడ రాజు, అనకాపల్లికి చెందిన పుట్టా కళ్యాణ శ్రీనివాసరావు కలిసి వెబ్సైట్లు, యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించి, వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.