విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సీతంరాజు సుధాకర్ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. శుక్రవారం నాడు కార్పొరేటర్లతో కలిసి ఆయన కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్య వల్ల మంచినీరు కలుషితమవుతోందని, దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు.