విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం నాడు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, వందలాది మంది భక్తులు పాల్గొని, స్వయంగా అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.