రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి స్వయంగా అభిషేకం నిర్వహించారు. వేలాది మంది మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది.