ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ప్రస్థానంలో కీలక ఘట్టంగా, గూగుల్ సంస్థ నిర్మించనున్న భారీ ఏఐ డేటా సెంటర్కు ఈ నెల 28న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో చేపడుతున్న ఈ ప్రాజెక్టు, అమెరికా వెలుపల గూగుల్కు అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా విశాఖపట్నం గ్లోబల్ టెక్ హబ్గా ఎదగడంతో పాటు, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.