ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా, పౌరులంతా సైక్లింగ్ను పర్యావరణహిత, స్థిరమైన రవాణా మార్గంగా స్వీకరించాలని జీవీఎంసీ అధికారులు పిలుపునిచ్చారు. సైక్లింగ్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. ప్రతిరోజూ సైక్లింగ్ను జీవనశైలిలో భాగంగా చేసుకుని, పరిశుభ్రమైన, పచ్చదనంతో నిండిన ఆరోగ్యవంతమైన విశాఖపట్నం నిర్మాణానికి కలిసి కృషి చేయాలని కోరుతూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేశారు.