విశాఖపట్నం పర్యటనలో ఉన్న కేంద్ర పోర్టులు, జలమార్గాలు, నౌకాయాన శాఖ మంత్రి శర్వానంద్ సోనోవాల్ను మాజీ రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు శనివారం విశాఖ నోవోటల్ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.