సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆభరణాల తనిఖీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. స్వామివారి బంగారం, వెండి ఆభరణాలు మాయమయ్యాయని కడపకు చెందిన కె. ప్రభాకరాచారి అనే వ్యక్తి గతంలో దేవాదాయశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో దేవాదాయశాఖ ఆర్జేసీ నేతృత్వంలో ఒక కమిటీ తనిఖీలు చేసి నివేదిక సమర్పించింది. ఆగస్టు 8న ఐదుగురు సభ్యుల కమిటీ సింహగిరికి వచ్చి ఆభరణాలను తనిఖీ చేస్తుందని గురువారం ఆయన తెలిపారు.