బాపట్లలో జరగనున్న 42వ రాష్ట్ర స్థాయి టెన్నీకాయిడ్ పోటీల కోసం జిల్లా జట్టును శనివారం సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఎంపిక చేశారు. నవంబర్ 7వ తేదీ నుండి చీరాలలో ఈ పోటీలు జరగనున్నాయి. పుప్పాటి అభినాష్, జి. అశ్లేష్ కుమార్, పి. ప్రవీణ్ కుమార్, కె. ఇనోష్లను జట్టు సభ్యులుగా ఎంపిక చేశారు. రాష్ట్ర విజేతలు నవంబర్ 26 నుండి జమ్మూలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు.