AP: టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం అమరావతిలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో ఆమె మాట్లాడుతూ.. ‘ప్రతి ఇంట్లో పిలల్లు పుడతారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇంట్లో యోధులు పుడతారు. మనం పనిచేసేది పార్టీ కోసం, మన అధినేత కోసం, పార్టీ నినాదం కోసం. టీడీపీ సిద్ధాంతాలకు ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలి’ అని అన్నారు.