AP: సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది ఉమ్రా యాత్రికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ యాత్రకు వెళ్లిన ఏపీవాసులు.. తాము క్షేమంగా ఉన్నట్లు ఓ వీడియోను నెట్టింట రిలీజ్ చేశారు. తామంతా గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి ఉమ్రా యాత్రకు వచ్చామన్నారు. సౌదీలో జరిగిన ప్రమాదం గురించి తెలిసిందని, అల్లా దయతో తాము క్షేమంగా ఉన్నామని వెల్లడించారు. యాత్రను పూర్తి చేసుకుని త్వరలో స్వస్థలాలకు చేరుకుంటామని స్పష్టం చేశారు.