AP: ‘తల్లికి వందనం’పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జూన్లో తల్లికి వందనం నిధులను అందిస్తామని, తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తామని తెలిపారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతేనని, ఇక దాన్ని ఇంచు కూడా ఎవరూ కదిలించలేరని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత పాలకులు అమరావతిని విధ్వంసం చేశారని మండిపడ్డారు. ఎడారి అని, శ్మశానమని ఎగతాళి చేశారని గుర్తు చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విజంమూరు సభలో విమర్శించారు.