AP: వార్డు సచివాలయాల్లోని సంక్షేమ కార్యదర్శులే ఇకపై ఎడ్యుకేషన్ (విద్య) బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చేసిన సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో, న్యాయశాఖ గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతకుముందు ఎడ్యుకేషన్, డేటా ప్రోసెసింగ్ కార్యదర్శుల ఆధీనంలో ఉన్న ఎడ్యుకేషన్ సబ్జెక్టును ఇప్పుడు సంక్షేమ కార్యదర్శులకు బదిలీ చేస్తూ ఈ చట్ట సవరణ జరిగింది.