కోల్కతాలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా వైద్యులు నేటి నుంచి నిరసన చేపట్టనున్నారు. జాతీయ వైద్యసంఘం పిలుపు మేరకు శనివారం ఉదయం నుంచి 24 గంటల పాటు ఉమ్మడి జిల్లాలో 1, 350 ప్రైవేటు ఆసుపత్రులు, ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యులంతా సేవలు నిలిపివేయనున్నారు. అత్యవసర వైద్య సేవలకు మాత్రమే హాజరవుతారు.