నాలుక కోస్తానంటే చూస్తూ ఊరుకోను - రఘురామ

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తాను రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావిస్తే, 'నాలుక కోస్తాం. సమాధి కడతాం' వంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం పెదఅమిరంలోని తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏలూరులో జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. దీనిపై తన అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్