పెనుమంట్ర: హైస్కూల్ విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలు

పెనుమంట్ర గ్రామంలోని ఆర్.ఏ జడ్పీ హైస్కూల్లో గురువారం విద్యార్థులకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలతో పాటు పొడవు, బరువు వంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం భాగ్య కుమారి, ఆశా సిబ్బంది, మేల్ అసిస్టెంట్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్