పోడూరు మండలం పండిత విల్లూరు గ్రామములోని శ్రీ కేశవ స్వామి వారి ఆలయంలో తమలపాకులు (నాగవల్లి పత్ర) అలంకరణలో శ్రీ మరకత మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రావణ మాస రెండవ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలకరించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.