శ్రీరామనవమి వార్షిక మహోత్సవాల సందర్భంగా భీమవరం మెంటే వారి తోటలో ఉన్న శ్రీ భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. మాజీ శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ తనయుడు గ్రంధి రవితేజ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలను స్థానికులు, భక్తుల సహకారంతో వైభవంగా నిర్వహిస్తూ, పెద్ద ఎత్తున అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగినదని ఆయన పేర్కొన్నారు.