పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు హాజరయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.