భీమవరంలో కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ నాగరాణి విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 5న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.