భీమవరంలో స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ, స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయులని, ఆయన బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని, దేశ ఔన్నత్యాన్ని, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి వివేకానంద అని కొనియాడారు. ఈ కార్యక్రమం శనివారం జరిగింది.