పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఓ యువతితో సహజీవనం చేసి, ఆమె గర్భం దాల్చిన తర్వాత పరారైన యువకుడిపై పోలీసులు గురువారం అత్యాచార కేసు నమోదు చేశారు. యనమలకుదురుకు చెందిన 21 ఏళ్ల యువతి, పటమటలోని సూపర్ మార్కెట్లో పనిచేస్తుండగా, హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న భీమవరానికి చెందిన బాల కేదారేశ్వర స్వామి పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడి, యువతి గర్భం దాల్చిన తర్వాత నిందితుడు పరారయ్యాడని మాచవరం సీఐ వెంకట రమణ తెలిపారు.