వీరవాసం మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద సోమవారం రాత్రి నర్సాపూర్ ప్యాసింజర్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై రైల్వే SI సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు భీమవరం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. మృతదేహం ఆచూకీ కోసం పోలీసులు గ్రామస్థులను సంప్రదిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.