చింతలపూడి సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతులు నిమిత్తం శుక్రవారం కరెంటు నిలుపుదల చేస్తున్నట్లు ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లింగపాలెం ఫీడర్లోని వెలగలపల్లి సబ్ స్టేషన్, టీ. నరసాపురం ఫీడర్ పరిధిలోగల తీగలవంచ సబ్ స్టేషన్, సీతానగరం తదితర గ్రామాలలో రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్కు అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలన్నారు.