దెందులూరు: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే తెరవాలి

ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్, రాష్ట్రంలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేశారు. దెందులూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాలకుపైగా మొక్కజొన్న పండించిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు తెరవకపోతే రైతులు నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్