దెందులూరు: ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఎమ్మెల్యే ఆరా

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో నిర్వహించిన సుపరిపాలనలో-తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం పర్యటించారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్