దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, ప్రజలకు అండగా నిలవాలని సంబంధిత అధికారులను కోరారు. దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కూటమి నాయకులు, ప్రజలు ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించిన ఆయన, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.