పెదపాడు మండలం గోగుంటలో పేకాట శిబిరంపై ఎస్ఐ శారద సతీష్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. తమకు అందిన సమాచారం మేరకు సోమవారం సిబ్బందితో కలిసి దాడులు చేసి పదిమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 27,630 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.