పెదవేగి: కోకో బోర్డు ఏర్పాటు చేయాలి

రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం పెదవేగి మండలం వంగూరులో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఆధ్వర్యంలో కోకో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ధర వచ్చేలా ఫార్ములా రూపొందించాలన్నారు.

సంబంధిత పోస్ట్