దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. బుధవారం పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాల ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.