ఏలూరు జిల్లా నూజివీడులోని కొండయ్య సత్రం బావిలో అనుమానాస్పద స్థితిలో ఉన్న తాళ్లూరి నాగరాజు(56) అనే వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు సోమవారం కనుగొన్నారు. నాగరాజు పెయింటింగ్ పనులు చేసుకుంటూ కొండయ్య సత్రంలో అద్దె గదిలో నివాసం ఉంటున్నాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.